పెరిగిన సొంతింటి బయ్యర్లు
Home buyers surge across India as interest rates fall. Hyderabad real estate sees strong growth in 2025 driven by IT, pharma expansion and investor confidence.
భారత్ లో సొంత ఇంటిని కొనుగోలు చేసేవారి సంఖ్య పెరుగుతోందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో ఈ రంగంలో 6.5 నుంచి 7.3 శాతం వరకూ వృద్ధి కనిపించే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ సేవల సంస్థ బ్రిక్ వర్క్ రేటింగ్స్ అంచనా వేసింది.
గృహ రుణాలకు సంబంధించిన వడ్డీ రేట్లు తగ్గుతుండటం ఇందుకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. ఇదే సమయంలో ప్రజల వద్ద మిగులు మొత్తం పెరుగుతుండటం మరో కారణమని బ్రిక్వర్క్ రేటింగ్స్ పేర్కొంది. దేశ జీడీపీ వృద్ధి సుమారు 8.2 శాతంగా ఉందని, ద్రవ్యోల్బణం నియంత్రణ స్థాయిలో ఉందని స్పష్టం చేసింది. హైదరాబాద్ సహా విశాఖపట్నం, అమరావతి ప్రాంతాల్లో నివాస గృహాల మార్కెట్ వృద్ధి చెందుతోందని బ్రిక్వర్క్ నివేదిక చెబుతోంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ విస్తరణ, గ్లోబల్ రైజింగ్ సమిట్ లాంటివి హైదరాబాద్ లో పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచాయి. అటు ఆంధ్రప్రదేశ్ లోనూ రియల్ ఎస్టేట్ మంచి పని తీరు కనబరుస్తోందని చెబుతున్నారు. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ గూగుల్ వంటి కంపెనీలు ఏపీకి రావడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల వృద్ధి నేపథ్యంలో వాణిజ్య స్తిరాస్తికి డిమాండ్ పెరుగుతోందని బ్రిక్ వర్క్ రేటింగ్స్ పేర్కొంది. 2034 నాటికి తెలంగాణ ఒక ట్రిలియన్ డాలర్ల వృద్ధిని సాధించాలంటే.. 12 నుంచి 13 శాతం వృద్ధిని సాధించాల్సిన అవసరం ఉందని అంచనా వేసింది.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0