ప్రాపర్టీ లావాదేవీల్లో జితేంద్ర కపూర్ టాప్

Jeetendra Kapoor tops Bollywood real estate deals in 2025 with ₹855 crore sale in Mumbai. Amitabh Bachchan, Akshay Kumar and Hrithik follow next.

Dec 26, 2025 - 00:01
 0  192
ప్రాపర్టీ లావాదేవీల్లో   జితేంద్ర కపూర్ టాప్
jeetendra-kapoor-top-bollywood-real-estate-deals-2025

-      బాలీవుడ్ లో రూ.855 కోట్ల లావాదేవీతో అగ్రస్థానం

-      తర్వాతి స్థానాల్లో అమితాబ్, అక్షయ్, హృతిక్

2025లో రియల్ ఎస్టేట్ లావాదేవీల్లో సీనియర్ నటుడు జితేంద్ర కపూర్ టాప్ లో నిలిచారు. తర్వాతి స్థానాల్లో అమితాబ్ బచ్చన్, అక్షయ్ కపూర్, హృతిక్ రోషన్ ఉన్నారు. జితేంద్ర కపూర్, ఆయన కుటుంబం 2025 మేలో ముంబైలోని అంధేరిలో ఉన్న భూమిని ఎన్ టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ కు రూ.855 కోట్లకు విక్రయించారు. ఈ ప్రాపర్టీని తమ  కుటుంబానికి చెందిన పాంథియోన్ బిల్డ్ కాన్ ప్రైవేట్ లిమిటెడ్, తుషార్ ఇన్‌ఫ్రా డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా విక్రయించారు. విలువ పరంగా 2025లో బాలీవుడ్ కుటుంబం చేసిన అతిపెద్ద రియల్ ఎస్టేట్ లావాదేవీ ఇదే. ఈ ఒప్పందం మే 29న జరిగింది. సుమారు 9,664.68 చదరపు మీటర్లు (2.39 ఎకరాలు) విస్తీర్ణంలో ఉన్న రెండు ఆనుకొని ఉన్న ప్లాట్లు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ స్థలంలో బాలాజీ ఐటి పార్క్ ఉంది. ఈ భూమిలో సుమారు 4.9 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు భవనాలు ఉన్నాయని పత్రాలు  చూపించాయి.

 

గతంలో నెట్‌మ్యాజిక్ ఐటీ సర్వీసెస్ గా ఉన్న ఎన్‌టీటీ గ్లోబల్ డేటా సెంటర్స్ అండ్ క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఈ భూమిని కొనుగోలు చేసింది. ఈ సంస్థ క్లౌడ్ సొల్యూషన్స్హోస్టింగ్డేటా మేనేజ్‌మెంట్సైబర్‌ సెక్యూరిటీ మరియు అప్లికేషన్ డెవలప్‌మెంట్‌తో సహా అనేక రకాల సాంకేతిక సేవలను అందిస్తుంది. అలాగే జితేంద్ర కపూర్, ఆయన కుమార్తెబాలాజీ టెలిఫిల్మ్స్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు ఏక్తా కపూర్ జూన్ 2025లో వర్లిలో ఒక అపార్ట్ మెంట్‌ను 12.25 కోట్లకు విక్రయించారు. 

* జితేంద్ర తర్వాత అధికంగా రియల్ లావాదేవీలు జరిపిన వారిలో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. 2025లో ఆయన బహుళ ఆస్తుల కొనుగోలు, అమ్మకాలతో సహా వరుస అధిక-విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలతో వార్తల్లో నిలిచారు. మొత్తమ్మీద ఆయన కొనుగోళ్లు, అమ్మకాలపరంగా దాదాపు రూ.140 కోట్ల విలువైన లావాదేవీలు నిర్వహించారు. జనవరి 2025లో అమితాబ్ ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న తన డ్యూప్లెక్స్ అపార్ట్ మెంట్‌ను రూ.83 కోట్లకు అమ్మినందుకు వార్తల్లో నిలిచారు. బచ్చన్ అదే అపార్ట్ మెంట్‌ను ఏప్రిల్ 2021లో రూ.31 కోట్లకు కొనుగోలు చేశారు. పత్రాల ప్రకారంఈ అపార్ట్‌మెంట్ 5,185 చదరపు అడుగుల రెరా కార్పెట్ ఏరియాలో విస్తరించి ఉంది. అలాగే రామ మందిరానికి నిలయమైన అయోధ్యలో తన రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించారు. ఈసారి ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధావారి లగ్జరీ ప్లాటెడ్ డెవలప్‌మెంట్ 'ది సరయు'కు ఆనుకుని ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను కొనుగోలు చేశారు. ఈ ఒప్పందం విలువ దాదాపు రూ.40 కోట్లు ఉంటుందని సమాచారం. అక్టోబర్ 2025లోబచ్చన్ ముంబై సమీపంలోని అలీబాగ్‌లో మూడు ఆనుకుని ఉన్న భూ పార్శిళ్లను కొనుగోలు చేశారు. ఈ మూడు భూ పార్శిళ్లు 9,557 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నాయి. వాటి మొత్తం విలువ 6.59 కోట్లు. నవంబర్ 2025లో బచ్చన్ ముంబైలోని గోరేగావ్‌లో ఉన్న రెండు పక్కపక్కనే ఉన్న లగ్జరీ అపార్ట్‌మెంట్లను రూ.12 కోట్లకు విక్రయించారు. 2012లో ఈ యూనిట్లను 8.12 కోట్లకు కొనుగోలు చేసిన ఈ సీనియర్ బాలీవుడ్ సూపర్‌స్టార్గత 13 ఏళ్లలో సుమారు 47% పెట్టుబడిపై రాబడిని పొందారు. 

* అమితాబ్ తర్వాత నటుడు అక్షయ్ కుమార్ 2025లో రూ.100 కోట్లకు పైగా విలువైన బహుళ రియల్ ఎస్టేట్ ఆస్తులను విక్రయించారు. ఈయన ఎనిమిది ప్రాపర్టీలను అమ్మడం ద్వారా దాదాపు రూ.110 కోట్లు సంపాదించారు. అక్షయ్ తర్వాత హృతిక్ రోషన్, ఆయన కుటుంబం రూ.80 కోట్లు లావాదేవీలతో నాలుగో స్థానంలో ఉన్నారు.

 

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0