పరిపాలనలో అవినీతి తగ్గితేనే 2047 నాటికి 3 ట్రిలియన్లకు..
Telangana’s 3 trillion economy goal by 2047 needs transparent governance and corruption-free administration, say experts in an REJ News opinion poll.
2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి తెలంగాణను తీసుకెళ్లాలన్న లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవడమో గొప్ప నిర్ణయం. సింగపూర్, సియోల్ వంటి దేశాలతో పోటీ పడాలనే తత్వం ఉండటం ఆహ్వానించదగ్గ పరిణామం. కాకపోతే, ఆయా దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థికశక్తులుగా ఎలా ఎదిగాయనే విషయాన్ని ఒకసారి క్షుణ్నంగా గమనించాలి. కొత్త సంస్థలకు ప్రత్యేకం ప్రోత్సాహంతో పాటు పారదర్శకమైన విధానాలు, అవినీతిరహిత పరిపాలన వంటివీ ముఖ్య భూమికను పోషించాయి. మరి, మన రాష్ట్రంలోనూ అవినీతికి చరమగీతం పాడినప్పుడే.. ప్రభుత్వం ఏర్పరుచుకున్న ఉన్నత లక్ష్యాలకు చేరుకోవడం కష్టమేం కాదని.. ఆర్ఈజీ న్యూస్ నిర్వహించిన ఓపినియన్ పోల్లో పలువురు అభిప్రాయపడ్డారు.
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0